janampulse
Breaking News

ప్రధాన పాత్రలో వైసీపీ ఎమ్మెల్యే…అమ్మఒడి పథకంపై సినిమా

ముఖ్యమంత్రి జగన్ తీసుకొచ్చిన అమ్మఒడి పథకంపై సినిమా తీయడం ఆనందంగా ఉందన్నారు ఎమ్మెల్యే పాల్గుణ. తాను కూడా ఓ ముఖ్యమైన పాత్ర చేయడం గర్వంగా ఉందన్నారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. వీటిలో ముఖ్యంగా అమ్మఒడి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నో ప్రశంసలు అందుకున్న ఈ పథకంపై ఏకంగా సినిమా రాబోతోంది. శ్రీదత్తాత్రేయ క్రియేషన్స్‌ బ్యానర్‌ ఓ మూవీని తీస్తోంది. ఈ చిత్రంలో విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ ప్రధానోపాధ్యాయుడి పాత్ర పోషిస్తున్నారు. ఈ షూటింగ్‌కు తహసీల్దార్‌ ప్రకాష్‌రావు క్లాప్‌ కొట్టారు. పాడేరు మండలంలోని దిగుమోదాపుట్టు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో కొంత షూటింగ్ జరిగింది. ఎమ్మెల్యేపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.

ముఖ్యమంత్రి జగన్ తీసుకొచ్చిన అమ్మఒడి పథకంపై సినిమా తీయడం ఆనందంగా ఉందన్నారు. తాను కూడా ఓ ముఖ్యమైన పాత్ర చేయడం గర్వంగా ఉందన్నారు. ఈ పథకాన్ని సీఎం జగన్‌ ఎంతో పారదర్శకంగా అందిస్తున్నారన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను నాడు–నేడు పేరుతో అభివృద్ధి చేశారని ప్రశంసించారు. అమ్మఒడి పథకంపై చిత్రం నిర్మించడం గొప్ప విషయమని చిత్ర నిర్మాత, దర్శకులను అభినందించారు. ఈ సినిమాకు త్రినాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరగా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ తెలిపింది.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.