janampulse
Breaking News

ఆనం కుటుంబానికి మరో కీలక పదవి

Another key post for the Anam family

ఆనం పొలిటికల్ స్కూల్లో చాలా మంది నాయకులు అక్కడ రాజకీయాలు నేర్చుకుని రాజకీయాల్లో కీలక పదవుల్లో ఉన్నారు..కాంగ్రెస్ పార్టీ లో ఆనాడు పొలిటికల్ గా లీడర్లు అయిన వారు ఉన్నారు, ఇప్పుడు ఆనం కుటుంబం వైసీపీలో ఉంది.

వైఎస్ హయాంలో ఆయనకు సన్నిహితులుగానే ఆనం సోదరులు ఉండేవారు, గతంలో వైయస్ మరణించిన తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి సీఎం అయిపోతారనే ఊహాగానాలు కూడా వచ్చేవి.

ఇక తర్వాత కాంగ్రెస్ గాలివానలో ఆనం సోదరులు కూడా ఓటమి పాలయ్యారు, తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి ఆనం వివేకానందరెడ్డిలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారి సోదరుడు ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనే ఆనం విజయ్ కుమార్ రెడ్డి.అనారోగ్యంతో వివేకానందరెడ్డి మరణానంతరం రామనారాయణ రెడ్డి చంద్రబాబుకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిపోయారు.

ఈ ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు సీఎం జగన్.. ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు… ఈ గెలుపుతో మంత్రి పదవి వస్తుంది అని అనుకున్నారు కాని కాకాణి, అనిల్, గౌతమ్ రెడ్డి లాంటి నేతలు లిస్టులో ఉన్నారు కాబట్టి జగన్ ఆనం బ్రదర్ కు మంత్రి పదవి ఇవ్వలేదు, అయితే సింహపురిలో ఇప్పుడు ఆనం ఫ్యామిలీ మళ్లీ చక్రం తిప్పాలనుకుంటోంది.

జగన్ తాజాగా ఆనం విజయ్ కుమార్ రెడ్డికి కీలక పదవి ఇవ్వబోతున్నారు అని తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో జడ్పీ పీఠాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే సొంతం చేసుకునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పీఠం విషయంలో విజయ్ కుమార్ రెడ్డికి జగన్ ఆ పీఠం ఇస్తాను అని చెప్పారట, దీంతో ఆనం కుటుంబంలో సందడి మొదలైంది.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.