janampulse
Breaking News

రూ. 10 వేల కోట్లు..ఆ ఇళ్లు అమ్ముకోవచ్చు, తాకట్టు పెట్టొచ్చు:YS Jagan శుభవార్త

ఏపీలో ఓటీఎస్ పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు.

జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (ఓటీఎస్‌) పథకంపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. విపక్షాలపై సీఎం జగన్ కౌంటర్‌ అటాక్‌కు దిగారు. ఓటీఎస్‌ పథకం, గృహ నిర్మాణంపై బుధవారం సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. ఈ సందర్భంగా,  ఓటీఎస్ పథకంపై ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఓటీఎస్‌‌పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఓటీఎస్‌ అనేది పూర్తిగా స్వచ్ఛందమని తేల్చి చెప్పారు. లబ్ధిదారులకు క్లియర్‌ టైటిల్‌తో రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామని వెల్లడించారు. ఓటీఎస్ ద్వారా పేదలపై రూ. 10 వేల కోట్ల భారాన్ని తొలగిస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఈ విషయంలో పేదలకు ఉన్న రుణాలు మాఫీ చేస్తున్నామని, రిజిస్ట్రేషన్‌ కూడా ఉచితంగా చేస్తున్నట్లు వెల్లడించారు. ఓటీఎస్ ద్వారా పేదలకు సంపూర్ణ హక్కులు వస్తాయని స్పష్టం చేశారు. ఓటీఎస్‌పై ప్రజలకు సంపూర్ణ అవగాహన తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇక, ఓటీఎస్ పథకం అమలు కాకుండా చాలామంది పలు రకాలుగా సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. గతంలో కనీసం వడ్డీ మాఫీ చేయాలన్న ప్రతిపాదలను కూడా టీడీపీ ప్రభుత్వం పరిశీలించలేదని వివరించారు. సుమారు 43 వేల మంది గత ప్రభుత్వ హయాంలో అసలు, వడ్డీ కూడా కట్టారని.. ఇవాళ మాట్లాడుతున్నవారు అప్పుడు ఎందుకు కట్టించున్నారని నిలదీశారు. అసలు, వడ్డీ కడితేనే బీ– ఫారం పట్టా మాత్రమే ఇచ్చేవారని.. ఇప్పుడు ఓటీఎస్‌ పథకం ద్వారా అన్నిరకాలుగా సంపూర్ణ హక్కులు ఇస్తున్నామని సీఎం జగన్ గుర్తు చేశారు. ఈ ఇంటిని అవసరాలకు తనఖా పెట్టుకోవచ్చు, అమ్ముకునే హక్కు కూడా ఉంటుందని చెప్పారు. పేదలకు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నామన్న సీఎం జగన్.. ఆ అవకాశాలను వాడుకోవాలా? లేదా? అన్నది వారి ఇష్టమని తేల్చి చెప్పారు.

డిసెంబర్‌ 21వ తేదీ నుంచే రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఇవ్వడం మొదలుపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో కట్టిన 43 వేల మందికి కూడా రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామని ప్రకటించిన సీఎం జగన్.. వారికీ సంపూర్ణ హక్కులు కల్పిస్తూ మేలు చేస్తామని వెల్లడించారు. భవిష్యత్తులో గ్రామ సచివాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్‌ పనులు కూడా జరుగుతాయని వెల్లడించారు.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.