
లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్
ఆర్థికంగా భారమైనా సరే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామన్నముఖ్యమంత్రి జగన్. ఏటా దాదాపు రూ.18,000 కోట్ల ఖర్చు అవుతోందని.. ఈ జనవరి 1 నుంచి పెంచబోతున్న పెన్షన్తో ఈ ఖర్చు దాదాపు రూ.20,000 కోట్లకు చేరుతుందన్నారు.
ఏపీలో పింఛన్ డబ్బులు పెంచుతూ జగన్ ప్రభుత్వం తీపి కబురు చెప్పిన సంగతి తెలిసిందే. కొత్త ఏడాది నుంచి పింఛన్లను నెలకు మరో రూ.2,250 నుంచి రూ.2,500 చేసింది. ఈ మేరకు పింఛన్ అందుకుంటున్న లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యక్తిగతంగా లేఖ రాశారు. వాలంటీర్లు 1 నుంచి పింఛన్ డబ్బులతో పాటు సీఎం రాసిన లేఖను అందజేస్తారు. ఆ లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు. కరోనా కష్టాలు బెంటాడుతున్నా.. ఆర్థికంగా భారమైనా సరే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామన్నారు ముఖ్యమంత్రి.
కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఒక శుభవార్త అందించాలని ఈ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. గతంలో పింఛన్ కోసం జన్మభూమి కమిటీ సభ్యుల చుట్టూ తిరుగుతూ లంచాలు, వివక్షతో పింఛన్ల కోసం పడిన కష్టాలను చూశానన్నారు. అర్హులు ఎంత మంది ఉన్నా.. ఎలాగైనా పింఛన్ల సంఖ్య తగ్గించాలని ఒక్కో గ్రామానికి ఇన్నే అని గత ప్రభుత్వం కోటా పెట్టిందన్నారు. ఆ కోటాకు మించి ఎంత మంది అర్హులున్నా వారెవ్వరికీ పింఛన్లు ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పింఛన్ ఇచ్చారన్నారు. తన పాదయాత్రలో అందరి ఇబ్బందుల్ని చూసి గత ప్రభుత్వ సమయంలో ఉన్న పింఛన్లు 39 లక్షలను.. ఇప్పుడు దాదాపు 61 లక్షలు పెరిగిందన్నారు. ఏటా దాదాపు రూ.18,000 కోట్ల ఖర్చు అవుతోందని.. ఈ జనవరి 1 నుంచి పెంచబోతున్న పెన్షన్తో ఈ ఖర్చు దాదాపు రూ.20,000 కోట్లకు చేరుతుందన్నారు. ఈ నెల నుంచి క్రమం తప్పకుండా మీకు పెంచిన పెన్షన్ రూ.2,500 అందుతుందని.. ఒకవేళ పింఛన్ అందుకోవడంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే వెంటనే గ్రామ, వార్డు వలంటీర్.. గ్రామ, వార్డు సచివాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా పారదర్శక విధానంలో కులం, మతం, ప్రాంతం, ఏ రాజకీయ పార్టీ అనేది కూడా చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ లంచాలు, వివక్ష లేకుండా నూటికి నూరు శాతం సంతృప్త స్థాయిలో పింఛన్లు అందిస్తున్నామని గర్వంగా చెబుతున్నాను అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాను ప్రదర్శించి మరీ సామాజిక తనిఖీ ద్వారా అర్హులను గుర్తించి వారికి పెన్షన్ అందిస్తున్నామన్నారు. ఒకవేళ అర్హులు ఎవరైనా ఉంటే.. ఒకవేళ పించన్ రాకపోతే.. వాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే అన్నీ పరిశీలించి అందజేస్తామన్నారు.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్