janampulse
Breaking News

చెన్నై ఆస్పత్రిలో సీఎం కేసీఆర్ పరామర్శ..ఐసీయూలో మాజీ గవర్నర్‌

ఉమ్మడి ఏపీ, తెలంగాణ మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తీవ్ర అస్వస్తతతో ఆస్పత్రిలో చేరారు. చెన్నై పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లి నరసింహన్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెన్నై పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. మూడో రోజు పర్యటనలో ఆయన తీవ్ర అస్వస్తతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను పరామర్శించేందుకు వెళ్లారు. చెన్నైలోని కావేరి ఆస్పత్రికి వెళ్లిన KCR నరసింహన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. నరసింహన్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తుండడంతో దూరం నుంచే వైద్యులు అనుమతించారు. నరసింహన్‌ను దూరం నుంచి చూసిన కేసీఆర్ ఆస్పత్రిలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

1968 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన ఈఎస్‌ఎల్ నరసింహన్ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా పనిచేశారు. 2007లో ఆయన ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2009లో అప్పటి ఏపీ గవర్నర్ ఎన్డీ తివారీ రాజీనామాతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇన్‌చార్జి గవర్నర్‌గా నియమితులయ్యారు. అనంతరం 2010లో ఉమ్మడి ఏపీ గవర్నర్‌గా పూర్తి బాధ్యతలు స్వీకరించారు. ఛత్తీస్‌గఢ్ బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ సమయంలో ఈఎస్‌ఎల్ నరసింహన్ గవర్నర్‌గా ఉన్నారు. రాష్ట్ర విభజనానంతరం కూడా  ఈఎస్‌ఎల్ నరసింహన్  రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరించారు. ఆయన ఐదుగురు ముఖ్యమంత్రులతో కలసి పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రులు కె.రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో కలిసి పనిచేశారు. ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ నియమితులయ్యాక ఆయన తెలంగాణకు గవర్నర్‌గా ఉన్నారు. ఉమ్మడి ఏపీకి నరసింహన్ సుదీర్ఘ కాలం గవర్నర్‌గా పనిచేశారు. ఆయన ఆరోగ్యం బాలేదని తెలియడంతో సీఎం కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లి నరసింహన్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.