janampulse
Breaking News

జననేతకు అంతర్జాతీయ పురస్కారం

International Award for Janasena president Pawan Kalyan

జ‌న‌సేన తెలుగు రాష్ట్రాల్లో ఓ సంచ‌లన కాబోతోంది. పార్టీ పెట్ట‌కుండానే ల‌క్ష‌లాది మంది అభిమాన గ‌ణంతో ప‌వ‌న్ కు నీరాజ‌నం ప‌లుకుతున్నారు అభిమానులు. ముఖ్యంగా జ‌న‌సేన ఎఫెక్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది అని మేధావులు కూడా చెబుతున్నారు. ఏ రాజ‌కీయ నాయ‌కుడికి లేని క్రేజ్ ప‌వ‌న్  కు వ‌స్తోంది అంటే,  అది ఆయ‌న‌కు ఉన్న ఫాలోయింగ్ కు ఓ నిద‌ర్శ‌నం అంటారు ఆయ‌న అభిమానులు.

తాజాగా జనసేన అధినేత !! జ‌న‌సేనాని!! పవన్‌ కల్యాణ్‌కు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన అవార్డు దక్కింది. ఇండో యురోపియన్‌ బిజినెస్‌ ఫోరమ్  !! ఐఈబీఎఫ్ !! వివిధ రంగాల్లోని పేరుతెచ్చుకున్న ల‌బ్ద ప్ర‌తిష్టుల‌కు  ఏటా ఇచ్చే ఎక్స్‌లెన్స్‌ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. దీంతో జ‌న‌సేన అభిమానులు హుషారులో ఉన్నారు. ప‌వ‌న్ మానియా మ‌రోసారి నిరూపించ‌బ‌డింది అంటూ వారు ఆనందంలో ఉన్నారు. ప‌వ‌న్ కు ఈ  అవార్డ్  నవంబరు 17న  అందజేస్తారని జనసేన పార్టీ కార్యాలయం ఓ ప్ర‌క‌ట‌న లో తెలిపింది. బ్రిటన్ లోని హౌజ్ ఆఫ్ లార్డ్స్ సమావేశంలో  ప‌వ‌న్ కు పురస్కారం ప్రధానం  చేయ‌నుంది ఐఈబీఎఫ్‌.

ప‌వ‌న్ కు ఎంపిక చేసినందుకు ముఖ్య ఉద్దేశం !!

ఉత్త‌రాంధ్రాలో ఉద్దానం  ప్రాంతంలో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారిని ఆదుకోవడంలో, జ‌న‌సేన అధినేత  పవన్‌ చూపిన చొరవ, చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నిలిచిన తీరుకు స్పందించి, ప‌వ‌న్ ను  ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఐఈబీఎఫ్‌ తెలిపింది.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.