
ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్లో ఏపీ సీఎం… వైఎస్ జగన్కు ప్రధాని మోదీ స్పెషల్ విషెస్
ప్రధాని మోదీతో పాటూ పలువురు ప్రముఖులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వైఎస్సార్సీపీ నేతలు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జగన్కు శుభాకాంక్షలు తెలిపారు. జీవితాంతం సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీతో పాటూ పలువురు ప్రముఖులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వైఎస్సార్సీపీ నేతలు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ట్విట్టర్లో #HBDManOfMassesYSJagan హ్యాష్ ట్యాగ్తో విషెస్ మోత మోగుతోంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆ వేడుకలను అభిమానులు ఘనంగా చేపట్టారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు భారీ ఎత్తున సంబరాలు, కేక్ కటింగ్స్ చేస్తున్నారు. అలాగే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి YS Jagan పుట్టిన రోజు ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో సరికొత్త రికార్డ్ నమోదైంది. జక్కంపూడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2,745 మంది రక్తదానం చేసి రాష్ట్ర చరిత్రలో రికార్డు సృష్టించారు. రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్య మైదానంలో జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్ ప్రతినిధి జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉభయగోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన జగన్ అభిమానులు, వైఎస్సార్సీపీ శ్రేణులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. వరుసగా మూడో ఏడాది ఈ రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్