
వేలాది మందికి ఉపాధి..ఏపీలో మరో భారీ ప్రాజెక్ట్.. సీఎం జగన్తో కీలక భేటీ
ఏపీలో మరో భారీ ప్రాజెక్ట్కు రంగం సిద్ధమవుతోంది. శ్రీ సిమెంట్ కంపెనీ తొలిసారి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. సీఎం జగన్లో ఆ కంపెనీ ప్రతినిధులు
ఆంధ్రప్రదేశ్లో వరుసగా పెద్ద కంపెనీలు పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయి. ఇటీవలె ఫ్లిప్కార్ట్ కంపెనీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాగా.. తాజాగా మరో పెద్ద కంపెనీ ఏపీలో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకురెడీఅవుతోంది. గుంటూరు జిల్లా దాచేపల్లిలో రూ.1500 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ సిమెంట్ ప్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని శ్రీ సిమెంట్ గ్రూప్ లిమిటెడ్ ఎండీ హరిమోహన్ బంగూర్, జేఎండీ ప్రశాంత్ బంగూర్ కలిసి చర్చించారు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపారు. రూ.1500 కోట్ల పెట్టుబడితో రెండేళ్లలో ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. శ్రీ సిమెంట్ గ్రూప్ నుంచి ఏపీలో రాబోతున్న తొలి ప్లాంట్ ఇదేకావడం విశేషం. ఇప్పటికే శ్రీ సిమెంట్ కంపెనీ తొమ్మిది రాష్ట్రాలలో ప్లాంట్స్ ఏర్పాటు చేసింది. ఏపీలో తొలిసారి భారీ ప్లాంట్ ఏర్పాటుకు రెడీ అవుతోంది.
ఈ సందర్భంగా శ్రీ సిమెంట్ ఎండీ హెచ్ఎం బంగూర్ మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికీరణ పెద్ద ఎత్తున జరగాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని చెప్పారు. సీఎం జగన్ ఆలోచనా విధానంతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని.. అందుకే తాము ఏపీలో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో ప్లాంట్ ఏర్పాటు ద్వారా అనేక మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని జేఎండీ ప్రశాంత్ బంగూర్ తెలిపారు. వేల మందికి లబ్ధి జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ భేటీకి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, శ్రీ సిమెంట్ ప్రెసిడెంట్ (కమర్షియల్) సంజయ్ మెహతా, జీఎం జీవీఎన్ శ్రీధర్ రాజు, మేనేజర్ వెంకటరమణ, అసిస్టెంట్ మేనేజర్ సింహాద్రి చంద్రశేఖర్, అధికారులు హాజరయ్యారు.
Recent News
Latest Updates
- నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం
- పటారు పాలెం ప్రేమ కథ మూవీ రివ్యూ
- ప్రియురాలు కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి “విక్రమ్” సినిమా
- ఏపీ ప్రభుత్వంపై వర్మ సెటైర్లు..ఉప్మా, ఇడ్లీ, చీరల రేట్లు కూడా ఫిక్స్ చేస్తారా? YS Jagan
- చిచ్చురేపిన సోషల్ మీడియా పోస్ట్, తీవ్ర ఉద్రిక్తత…బాలయ్య ఇంటిని ముట్టడించిన వైసీపీ
- తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు…జగన్ బెయిల్ రద్దుపై
- చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా..?చంద్రబాబు లెక్క తప్పిందా..?
- లేఖ రాసిన సీఎం జగన్… ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్న్యూస్