janampulse
Breaking News

జగన్ బర్త్ డే సందర్భంగా అరుదైన ఫీట్..వైసీపీ కార్యకర్తల సరికొత్త రికార్డ్

ఉభయగోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన జగన్‌ అభిమానులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. వరుసగా మూడో ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఏపీ ముఖ్యమంత్రి YS JAGAN పుట్టినరోజు  ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో సరికొత్త రికార్డ్ నమోదైంది. జక్కంపూడి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 2,745 మంది రక్తదానం చేసి రాష్ట్ర చరిత్రలో రికార్డు సృష్టించారు. రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్య మైదానంలో జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్‌ ప్రతినిధి జక్కంపూడి గణేష్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉభయగోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన జగన్‌ అభిమానులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. వరుసగా మూడో ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రక్తదానం కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, శాప్‌చైర్మన్‌ బైరెడ్డి సిద్దార్థరెడ్డి ముందుగా రక్తదానం చేశారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా 2019లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో 2,043 మంది రక్తదానం చేశారు. ఆ తర్వాత ఏడాది (2020)లో 2,143 మంది రక్తదానం చేశారు. ఈ ఏడాది 2,745 మంది రక్తదానం చేసి సరికొత్త రికార్డు నమోదు చేశారు.

అలాగే రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా బర్త్ డే వేడుకలను అభిమానులు ఘనంగా చేపట్టారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలు భారీ ఎత్తున సంబరాలు, కేక్ కటింగ్స్‌ చేస్తున్నారు. అలాగే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Recent News

Janam Pulse provides latest breaking news, ploitical news, cinema entertainment news, latest central news, videos, political news and breaking news in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest news updates on your favourite politician. Also find more information on politics.